calender_icon.png 1 July, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్నిమాపక సిబ్బందిపై కాల్పులు

01-07-2025 12:00:00 AM

  1. దుర్ఘటనలో ఇద్దరు మృతి
  2. అమెరికాలోని ఇడాహోలో ఘటన

న్యూయార్క్, జూన్ 30: మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిపై ఓ దుండగుడు కాల్పులకు తెగబ డ్డాడు. అమెరికా వాయువ్య రాష్ట్రం ఇడాహోలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగుడి దుశ్చర్యలో ఇద్దరు అగ్నిమా పక సిబ్బంది మృతి చెందారు. స్థానిక అధికారులు తెలిపిన ప్రకారం.. కూటేనై కౌంటీలోని పర్వత ప్రాంతంలో ఉన్న పా ర్క్‌లో మంటలు అంటుకున్నాయి.

అగ్నిమాపక దళాలు ఘ టనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్న సమయంలో ఓ దుండగుడు రైఫిల్స్‌తో సిబ్బందిపై కాల్పులకు తెగబ డ్డాడు. అప్రమత్తమయ్యేలోపు వారిలోని ఇద్దరు సిబ్బంది మృత్యువాతపడ్డారు. పర్వత ప్రాంతంలో మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయని..

ఓ వైపు అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు పేర్కొన్నారు. పర్వత ప్రాంతంలో పౌరులు కూడా ఉండటంతో మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్టు వెల్లడించారు.