27-11-2025 12:00:00 AM
చేవెళ్ల, నవంబర్ 26(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, అల్లవాడ గేటు పరిసర ప్రాంతాలలో షాద్నగర్ వెళ్లే రహదారిని బుధవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, అప్రమత్తంగా వాహనాలు నడపాలని అధికారులు వాహనదారులను హెచ్చరించారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.