15-10-2025 12:00:00 AM
నిర్మల్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వివిధ వ్యాపార దుకాణాల్లో స్వీటోములు ఫుడ్ ఫాస్ట్ షాపులను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష మంగళవా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఆహారం కల్తీ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వ్యాపారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఆహార పదార్థాలు తయారు చేసేవారు నాణ్యమైన పదార్థాలను తయారు చేయాలని కల్తీకి పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.