13 May, 2026 | 10:01 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత

22-07-2025 12:31 AM
  1. తిరువనంతపురం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  2.    2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా సేవలు
  3. సీపీఎం పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర

తిరువనంతపురం, జూలై 21: కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ (101) తుదిశ్వాస విడిచారు. ఈ నెల 23న గుండెపోటుకు గురైన ఆయన తిరువనంతపురం లోని ఎస్‌యూటీ ప్రైవేటు ఆసుపత్రిలో చికి త్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన కన్నుమూశారు.

2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ ఒకరు. 1923 అక్టోబర్ 20న కేరళలో నిరుపేద కుటుంబం లో అచ్యుతానందన్ జన్మించారు.

కార్మిక ఉద్యమం నుంచి ప్రజా జీవితంలోకి

బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేసి.. దర్జీ దుకా ణంలో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ.. జీవనం సాగించిన అచ్యుతానందన్ కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. స్వాతంత్య్రానికి ముందున్న ట్రావెన్‌కోర్ సంస్థా నంలో భూస్వాములపై పోరాటంలో భా గంగా జైలు కెళ్లటంతో ఆరంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ప్రజా నేతగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది.

1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ను వదిలేసి.. సీపీఎం ఏర్పాటులో కీలకపాత్ర పోషిం చారు. 1985లో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరించారు. 1967 నుంచి 2016 దాకా ఏడుసార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 15 సంవత్సరాల పాటు అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా వ్యహరించి అధిక కాలం విపక్ష నేతగా కొనసాగి రికార్డులకెక్కారు. 

భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం

అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో అచ్యుతానందన్ ఎన్నడూ వెనుకంజ వేయలేదు. రాష్ట్రంలో భూఆక్రమణదారులపైనా ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం మో పారు. ఈ చర్యలతో వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆయన ఏనాడు భయపడలేదు. నిరంతర అధ్యయనశీలి అయిన అచ్యుతానందన్..

తన హయాంలో సాంకేతిక ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సాగుతోందని గుర్తించి అందరికి అం దుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కోసం ఉద్యమించడం విశేషం. వీఎస్ అచ్యుతానందన్ కె.వసుమతిని వివాహమాడారు. ఆయనకు కూతరు ఆశ, కుమారుడు అరుణ్ కుమార్ సంతానం. కాగా అచ్యుతానందన్ మృతి పట్ల సీఎం రేవంత్ సహా పలువరు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.