8 March, 2026 | 3:27 PM

Breaking News

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •  

గుంపులలో చెక్ డ్యాంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

22-11-2025 10:11 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామ పరిధిలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ అనుమానాస్పద పరిస్థితుల్లో కూలిపోయిన ఘటనపై శనివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మానేరు నదిపై మొత్తం 23 చెక్ డ్యాంలు నిర్మించిందని, వాటిలో గుంపుల–శమ్మునిపల్లె గ్రామాల మధ్య నిర్మించిన ఈ చెక్ డ్యామ్ చుట్టుపక్కల గ్రామాల వేలాది మంది రైతులకు ఆశాధారంగా నిలిచిందని పేర్కొన్నారు. కాని కొంతమంది స్వార్థపరులు, ఇసుక మాఫియా ప్రయోజనాల కోసం దురుద్దేశపూర్వకంగా చెక్ డ్యామ్‌ను పేల్చివేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన పనికి పాల్పడిన వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.