31 March, 2026 | 1:51 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

కాంగ్రెస్‌లో చేరిన అయిజ మాజీ ఎంపీపీ

29-11-2025 12:57 AM

అలంపూర్, నవంబర్ 28: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అలంపూర్ పరిధిలో బిఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది .ఆ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు  కాంగ్రెస్ గూటికి  చేరుతున్నారు. ఇటీవలే అయిజకు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక  మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదే దారిలోనే శుక్రవారం అయిజ మండల తాజా మాజీ ఎంపీపీ ప్రహల్లాద  రెడ్డి కూడా బిఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ లోని ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ను కలిసి వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు సంపత్ కుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంలో పూర్తి చేస్తామని తెలిపారు. వీరి వెంట ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామరెడ్డి, మురారి సోమ శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దీపక్ ప్రజ్ఞా ఉన్నారు.