calender_icon.png 1 December, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్కట్ పల్లి మాజీ జెడ్పిటిసి బీఆర్‌ఎస్‌ లో చేరిక

01-12-2025 08:09:40 PM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చిరుమర్తి లింగయ్య..

చిట్యాల (విజయక్రాంతి): నార్కట్ పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నార్కట్ పల్లి మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ దూదిమెట్ల సత్తయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నార్కట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా దూదిమెట్ల సత్తయ్య అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి అధికారికంగా ప్రకటిస్తూ అభినందనలు తెలియజేశారు. ఆయనతో పాటు నార్కట్ పల్లి మాజీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకటేశ్వర్లు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.