30 March, 2026 | 1:09 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష రూ.లక్ష చొప్పున జరిమానా

29-11-2025 01:08 AM

సంగారెడ్డి, నవంబర్ 28(విజయక్రాంతి):అక్రమంగా గంజాయిని తరలించిన నలుగురికి పదేళ్ళ పాటు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానాను సంగారెడ్డి ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్ కోర్టు న్యాయమూర్తి జయంతి శుక్రవారం తీర్పునిచ్చినట్లు మెదక్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్ తెలిపారు. 2021 ఫిబ్రవరిలో 102 కేజీల గంజాయిని అక్రమంగా రవాణ చేస్తుండగా జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

సంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఎస్త్స్ర హెచ్‌ఏ.మోహన్ కుమార్, రమేష్ రెడ్డి అక్రమ గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసును జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో ఎస్త్స్ర కేసు నమోదు చేశారని డీసీ తెలిపారు. ఈ కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి జయంతి నిందితులైన రాథోడ్ మోహన్, రాథోడ్ వెంకట్, కేతావత్ పాండు నాయక్, రాథోడ్ మోతిరాంలకు పది సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. గంజాయి నిందితులకు శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టిన ఎక్సైజ్ సిబ్బందిని డిప్యూటి కమిషనర్ హరికిషన్ అభినందించారు.