2 July, 2026 | 12:20 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

ఉచిత ఇసుక టోకెన్లు పంపిణీ

21-10-2025 10:47 PM

చేగుంట: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక టోకెన్లను ఎంపీడీవో చిన్నారెడ్డి, గృహనిర్మాణ శాఖ ఏఈ రియాజాద్దీన్, పిఎస్ సిఎస్ చైర్మన్ మ్యాకల పరమేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రుక్మాపూర్ గ్రామానికి చెందిన 18 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రెండు ట్రాక్టర్ల చొప్పున టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు, లబ్ధిదారులకు మాసాయిపేట మండలంలోని హల్టీ వాగు నుంచి తీసుకెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఎంపీడీవో చిన్నారెడ్డి తెలిపారు.