17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అల్కాపురి కాలనీలో ఫ్రెండ్లీ బాల్ బ్యాడ్మింటన్ మ్యాచ్

12-05-2025 02:45 AM

మణికొండ, మే 11: అల్కాపుర్ కాలనీలోని జయశంకర్ పార్కు గ్రౌండ్ లో మణికొండ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన సలహాదారుడు అందె లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు గోల్ మెడలిస్ట్ రాంమోహన రావు, మాజీ అధ్యక్షుడు ఆనంద్ రావుల నిర్వహణలో ఫ్రెండ్లీ బాల్ బ్యాడ్మింటన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మణికొండ ఆటగాళ్లు శ్రీనివాస్ రావు, రమేష్, రామిరెడ్డి, మాధవ్ రెడ్డి, శ్రీకృష్ణా, సీతారామరాజు, దేవేందర్ రెడ్డిలు పాల్గొనగా పరిగి తరపున శ్రీశైలం, హరిలాల్, కిష్టయ్య, శంకర్, జె. శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

రసవత్తరంగా సాగిన 3 ఆటలలో మొదట మణికొండ టీమ్ తరువాత పరిగి టీమ్ గెలుపొందగా మూడవ మ్యాచ్ మణికొండ వారు కైవసం చేసుకొన్నారనీ తదనంతరం ఈ మధ్య కాలంలో కేరళలో పాన్ ఇండియా మాస్టర్స్ ఆద్వర్యంలో జరిగిన 4వ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో పాల్గొని నాలుగు బంగారు పతకాలు సాధించిన మణికొండ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామ్మోహనరావుకు సంస్థ సభ్యులందరూ  సన్మానం చేశామని సంస్థ ప్రధాన సలహాదారుడు అందె లక్ష్మణ్ రావు తెలియజేశారు.