2 July, 2026 | 11:37 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

ఘనంగా గంగాదేవి బోనాల జాతర

17-07-2025 08:53 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణ సమీప గోదావరి నదీ తీరాన గంగా దేవి బోనాల జాతరను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మత్స్య లైసెన్స్ మార్కెటింగ్ సహకార సంఘాలు, వేములపల్లి, ఎల్ఐసి కాలనీ, రాంనగర్ సహకార సంఘాలు, తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వేములపల్లి నుంచి మంచిర్యాల పట్టణ పురవీధుల మీదుగా ఊరేగింపుగా బోనాలతో మహిళలు వారి కుటుంబ సభ్యులతో వచ్చి గోదావరి నది ఒడ్డున మొక్కులు చెల్లించారు. వాగులు, వంకలు, చెరువులు నిండి గోదావరి ప్రవహించే విధంగా వర్షాలు కురువాలని వేడుకున్నారు.