24-11-2025 07:41:26 PM
ముస్త్యాల గ్రామంలో ఘటన
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలోని న్యూ కాలనీలో సోమవారం పట్టపగలే ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ మెడలోని 3.5తులాల బంగారు తాడు రెండు వరుసలాది అపహారించుకొని వెళ్ళినాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సొంటె నర్సమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ ధరించి ఇంట్లోకి రావడంతో తెలిసిన వారు అనుకుని మాట్లాడే క్రమంలో వచ్చిన వ్యకి మెడలో ఉన్న బంగారు తాడును బలవంతంగా లాగి తీసుకోని మోటార్ సైకిల్ పై వెళ్ళినాడు అని తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న చేర్యాల సీఐ శ్రీను ఎస్ఐ నవీన్ ఘటన జరిగిన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.