24-11-2025 06:53:29 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణ ఏడిఏగా కే శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ శాఖ కమర్షియల్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న కే శ్రీనివాసరావుకు పదోన్నతి కల్పిస్తూ నిర్మల్ పట్టణ ఆపరేషన్ ఏఈగా నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావుకు ట్రాన్స్కో అధికారులు విద్యుత్ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ఏఈలు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.