17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి ‘పాలన పథకం’

22-10-2025 12:00 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాం తి): ఆదిలాబాద్‌లోని బలరక్షక్ భవన్లో మం గళవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాలన పథకంపై ఐసీడీఎస్ సిబ్బందికి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీడ్ రాజారామ్ ప్రసాద్, ప్రోగ్రామ్ అధికారి మాణికప్ప, ప్రధాన శిక్షణదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలన పథకం లక్ష్యాలు, అమలు విధానం, డేటా సేకరణ పద్ధతులు, మొబైల్ అప్లికేషన్ వినియోగం తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

అనంతరం రిక్షా కాలనీ, సంజయ్ నగర్, మహాలక్ష్మి వాడలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, కేంద్రాల పని తీరును రాష్ట్ర లీడ్ రాజారామ్ ప్రసాద్ పరిశీలించారు.  ‘పాలన పథకం’అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సమగ్రంగా పనిచేస్తే, గ్రామ స్థాయిలో సానుకూల మార్పులు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి మిల్క, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్, సీడీపీఓలు సౌందర్య, శారద, ఉమాదేవి, నర్సమ్మ, వినూత్న, డీఎంసీ యశోద, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.