21-07-2025 08:21:26 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని దేవునిపల్లిలో సోమవారం 25 సీసీటీవీ కెమెరాలను కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy) ప్రారంభించారు. కామారెడ్డి జీవధాన్ హాస్పిటల్ నుంచి వసుంధర వెంచర్ వరకు రోడ్డుకు ఇరువైపులా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సీసీటీవీ కెమెరాలను వసుంధర వెంచర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లి సిఐ రామన్, ఎస్సై పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.