14-05-2025 08:21:14 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలంలో కురిసిన అకాల వర్షానికి రైతు కల్లాల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మార్కెట్ యార్డ్ లో అమ్మకానికి తీసుకువచ్చిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.