21 March, 2026 | 7:27 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ పూర్తి

08-10-2025 12:35 AM

జిల్లా కలెక్టర్ కె.హైమావతి 

సిద్ధిపేట కలెక్టరేట్,అక్టోబర్ 7:స్థానిక సం స్థల ఎన్నికలలో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికల రాండమైజేషన్ ప్రక్రియ మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మం దిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి కె.హైమావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేజ్-1లో 176 మంది అర్‌ఓలు, 176 మంది ఏఅర్‌ఓలు, స్టేజ్-2లో 608 మంది అర్‌ఓలకు రాండమైజేషన్ పూర్తయింది.స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్‌ఓ, ఏఅర్‌ఓల నియామకాలు జరిపినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

వీరికి నిర్ణయించిన తేదీల్లో మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ త రగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అ గ్రవాల్, అబ్దుల్ హమీద్, జెడ్పీ సిఈఓ రమే ష్, డిపిఓ దేవకీదేవి, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఈడిఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.