17 June, 2026 | 12:17 PM

Breaking News

అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •  

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

26-11-2025 12:00 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, నవంబర్ 25 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మంగళవారం భువనగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చిన పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో  ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.

ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు.

తదుపరి కార్యాలయంలో ఉన్న  ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పిసిఓ శోభారాణి, మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్  రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.