23-05-2025 02:23:43 AM
కరీంనగర్ క్రైం, మే 22 (విజయ క్రాంతి): కరీంనగర్ మంకమ్మతోట భక్తాంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఫలపంచామృతాభిషేశం, విశేష పూజలు నిర్వహించారు. ఆనంతరం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం వేద పండితులు ఆంజనేయ శర్మ, ప్రధాన అర్చకులు మనోజ్ సాయి, హరీ, శ్రీనివాస్ శర్మలు నిర్వహించారు.
అనంతరం హోమం, భజన, భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్, ప్రధాన ఆలయ సేవకులు లోకేందర్, ప్రసాద్, రవీందర్, గుండేటి రామకృష్ణ, శ్యామ్, సంపత్, సాయి, ప్రసాద్, చందు, మల్లయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.