13 June, 2026 | 2:57 PM

Breaking News

ముత్తారంలో గణేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు   •   న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న సీఆర్‌పీలు   •   ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్   •   జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •  

ఘనంగా పెద్దమ్మతల్లి బోనాలు

16-11-2025 12:30 AM

బోనాలు సమర్పించిన ముదిరాజ్ కులస్తులు

హుజురాబాద్, నవంబర్ 15 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని రంగనాయకులగుట్ట వద్ద నూత నంగా నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయంలో అమ్మవారికి ముదిరాజ్ కులస్తులు శనివారం బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా గత నాలుగు రోజులుగా యజ్ఞాలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శనివారం అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనంతో తల్లి వద్దకు కదిలారు. మహిళలు, యువతులు, శివసత్తులు డప్పు చప్పుళ్లు మధ్య ఊరేగింపుగా చేరుకొని తల్లికి బోనాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు. భక్తు లు అధికసంఖ్యలో  రావడంతో ఆలయప్రాంగణం కోలాహలంగా మారింది.