23-12-2025 07:10:08 PM
బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
బోథ్,(విజయక్రాంతి): బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం బోథ్లోని అంబేద్కర్ చౌరస్తాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి, బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై అత్యంత పాశవికంగా దాడి చేస్తూ మారణ హోమం కొనసాగించడం చాలా బాధాకరం అన్నారు.
ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసే మేధావులందరూ ఎక్కడికి వెళ్లారని ఈ మారణకాండపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కనీసం దాడులను ఖండిస్తూ ఒక ప్రకటన కూడా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం రాజకీయాలు కాకుండా హిందువుల ప్రాణాలు రక్షించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, వెంటనే హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.