17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను.. మనోభావాలు దెబ్బతింటే క్షమించండి..

09-05-2025 01:39 AM

కరీంనగర్, మే 8 (విజయ క్రాంతి): ఆపరేషన్ సిందూర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఎస్ యు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.

తాను పేస్ బుక్ లో పెట్టిన కామెంట్ ని అనేక విధాలుగా వైరల్ కావడం చూసి భాధపడుతున్నానని పేర్కొన్నారు. తాను వృత్తి రీత్యా ఒక ప్రొఫెసర్ను, సామజిక బాధ్యతతో నేటికీ అనేక సామాజిక కార్యక్రమాలు నా స్వంత డబ్బుతో   చేస్తున్నానని తెలిపారు.

ఒక పరిశోదకురాలుగా యుద్ధం అంటే భయంతో, అందులో మరణించే పసిపిల్లలు గుర్తులు వచ్చి పోస్ట్ చేశాను తప్పితే, దేశ భద్రత, సైన్యం, ప్రభుత్యంపై ఎటువంటి అగౌరవంతో కాదని, నేను భాధ్యత కలిగిన పౌరురాలినని, దేశం అంటే భక్తి ఉంది కాబట్టే స్పందించానని పేర్కొన్నారు.

నా కామెంట్స్ ఎవరిని, ఏ మతాన్ని, సందర్భాన్ని కించపరిచెవి కావని, ఎవరైనా భాధపడినా, మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాల్సిందిగా  వేడుకొంటున్నానని పేర్కొన్నారు.