14-08-2025 12:50:38 AM
కరీంనగర్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కోతి రాంపూర్ బైపాస్ లో ఉన్న జ్యోతిరావు పూలే, భగత్ నగర్ చౌరస్తాలో గల భగత్ సింగ్ విగ్రహాల శుద్ధి, అలంకరణ కార్యక్రమం లో మాజీ మేయర్, బిజెపి నాయ కుడు వై సునీల్ రావు పాల్గొని విగ్రహాలను శుద్ధి చేశారు. అనంతరం వారి సేవలను, త్యాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.