calender_icon.png 11 July, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణాళికలుంటే జనాభా కూడా వరమే!

10-07-2025 12:00:00 AM

ఫిరోజ్‌ఖాన్ :

జనాభాను అంకెల పరంగానే కాకుండా జనసాంద్రత పరంగా పరిశీలిస్తే కూడా కొన్ని దేశాలు సరైన ప్రణాళికలతో ఎలా అభివృద్ధి పథంలో నడిచాయో తెలుస్తున్నది. ఇందులో అధిక జనసాంద్రత ఉన్న ప్పటికీ సింగపూర్ సమర్థవంతమైన ప్రణాళిక ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. జనసాంద్రత పరంగా సింగపూర్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నది.

ఈ దేశ వైశాల్యం 719.9 చదరపు కిలోమీటర్లు మాత్రమే కాగా, చదరపు కిలోమీటర్‌కు 8,595 మంది నివసిస్తున్నారు. అయితే అధిక ఆర్థిక వృద్ధి, అత్యుత్తమ గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలతో ప్రపంచంలోనే ఈ దేశం అగ్రగామిగా నిలుస్తున్నది. 

జనాభా అంశంపై ప్రపంచంలోని దేశాలు విభిన్న ఆలోచనా ధోరణితో ఉన్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికీ అ ధిక జనాభాతో బాధపడుతున్నట్టు భావిం చి నియంత్రణ చర్యలు పాటిస్తుండగా.. మ రికొన్ని దేశాలు జనాభా పెరుగుదల కో సం ప్రభుత్వ పరంగా అనేక ప్రోత్సాహకా లు అందిస్తున్నాయి. గతంలో జనాభా నియంత్రణ కోసం కఠిన చట్టాలు అమలు చేసిన దేశాలు సైతం ఇప్పుడు సడలింపు లు ఇస్తున్నాయి.

భారతదేశంలోని ఆయా రాష్ట్రాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నా యి. ఉత్తర భారతానికి చెందిన ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదిత ర రాష్ట్రాలు ఇప్పటికీ జనాభా నియంత్రణకు అధిక ప్రాధాన్యమిస్తుండగా.. దక్షిణా దికి చెందిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు జనాభా పెరుగుదలను ప్రోత్సహించే దిశలో ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జనాభా అనేది ప్రధాన సమస్య కాదని, ప్రభుత్వాల వద్ద సరైన ప్రణాళికలు లేకపోవడమే అసలు సమస్యలకు కారణమని తెలుస్తున్నది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని, సరైన ప్రణాళికలతో జనాభాను వినియోగించుకోగలి గితే అది దేశానికి శాపంగా కాకుండా వరం గా మారే అవకాశాలే ఎక్కువ అని పలు దే శాలు ఇప్పటికే నిరూపించాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా 820 కోట్లకు పైగానే ఉం ది.

2080 నాటికి ఇది 1,030 కోట్లకు చేరవచ్చని నిపుణుల అంచనా. 143 కోట్ల జనాభాతో భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉండగా, 142 కోట్లతో చైనా ద్వితీయ స్థానంలో పాగా వేసింది. జనాభా పెరుగుదల సమస్యలు దేశాల ఆర్థిక, సామాజిక, పర్యావరణ సందర్భాల పై ఆధారపడి ఉంటాయి. సరైన ప్రణాళిక లేనప్పుడు జనాభా పెరుగుదల ఒత్తిడిని సృష్టిస్తుంది, కానీ సమర్థవంతమైన విధానాలతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు. 

సరైన ప్రణాళికలతో సింగపూర్ ఇలా..

జనాభాను అంకెల పరంగానే కాకుం డా జనసాంద్రత పరంగా పరిశీలిస్తే కూడా కొన్ని దేశాలు సరైన ప్రణాళికలతో ఎలా అభివృద్ధి పథంలో నడిచాయో తెలుస్తుం ది. ఇందులో అధిక జనసాంద్రత ఉన్న ప్పటికీ సింగపూర్ సమర్థవంతమైన ప్రణాళిక ద్వారా ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. జనసాంద్రత పరంగా సింగపూర్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నది.

ఈ దేశ వైశాల్యం 719.9 చదరపు కిలోమీటర్లు మాత్రమే కాగా, చదరపు కిలోమీటర్‌కు 8,595 మంది నివసిస్తున్నా రు. అయితే అధిక ఆర్థిక వృద్ధి, అత్యు త్తమ గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలతో ప్రపంచంలోనే ఈ దేశం అగ్రగామిగా ని లుస్తున్నది. 1960 ‘స్టాప్ ఎట్ టూ’ కార్యక్రమం ద్వారా జనన రేటును తగ్గించిన సింగపూర్..

1980ల నుంచి ప్రో-నాటలిస్ట్ విధానాలతో (బేబీ బోనస్ స్కీమ్) ద్వారా జనన రేటును సమతౌల్యం చేసింది. జనాభా విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ఈ దేశ అభివృద్ధికి కారణమన్న విషయం తె లుస్తుంది. ఇలా అన్ని దేశాలు కూడా జనా భా విషయంలో ప్రవర్తిస్తే ఎటువంటి ఇ బ్బందులు లేకుండా ఉండొచ్చు. 

సరైన నిర్ణయాలతోనే చైనా అభివృద్ధి..

జనాభాలో మొన్నటి వరకు మొదటిస్థానంలో ఉండి ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న చైనా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్టు స్పష్టమవుతున్నది. చైనా జనాభా ప్రస్తుతం 142 కోట్లు. అయి తే జనసాంద్రతపరంగా ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా 83వ స్థానంలో ఉంది. ఈ దే శంలో చదరపు కిలోమీటర్‌కు 153 మం ది నివసిస్తున్నారు.

అయితే 1980 నుంచి 2015 వరకు చైనా వన్ చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేసింది. దీని ద్వారా సు మారు 40 కోట్ల జనాభాను ఆ దేశం ని యంత్రించగలిగింది. అయితే ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఆ దేశం జనాభా వ నరులను సమర్థవంతంగా ఉపయోగించింది. ఫలితంగా ఇప్పుడు చైనా ప్రపంచం లోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిం ది.

అయితే కఠిన విధానాలు జనాభా ని యంత్రణలో విజయవంతమైనప్పటికీ, దీర్ఘకాల సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సమస్యలను సృష్టించింది. వృద్ధ జనాభా ఎక్కువ కావ డం, లింగ నిష్పత్తిలో తేడాలు రావడంతో ఆ దేశం వెంటనే అప్రమత్తమైంది. 2015 లో టూ చైల్డ్ పాలసీ, 2021లో ముగ్గురు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టింది.

భారత్ మేల్కొనాల్సిన సమయం..

భారత్ 3,287,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలో ఏడో స్థానం లో ఉన్నా.. 143 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ జనసాంద్రత (485 /చదరపు కిలోమీటర్) ఎక్కువే. అయితే ఉత్త ర, దక్షిణ భారతదేశాల్లో పరిస్థితులు ఇం దుకు భిన్నంగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రా లు జనాభా నియంత్రణను కఠినంగా పాటించగా, ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి.

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో యువ జనా భా 65% (35 ఏళ్ల లోపు) ఉంది. ఇంత పెద్ద మొత్తంలో యువ జనాభా ఏ దేశంలో కూడా లేదు. అందుకోసమే భారత్‌ను అం తా యువశక్తిగా కీర్తిస్తున్నారు. ఈ అంశం సరైన ప్రణాళికతో ఆర్థిక వృద్ధికి దోహదపడగలదు. సరైన అర్బన్ ప్లానింగ్ పాలసీ, ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక వినియోగం వంటి వాటిపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి.

విద్య, ఆరోగ్యం, సాంకేతికతను ఉపయోగించి జనాభాను ఒక శక్తిగా మార్చాలి. ఎ గుమతి -ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా యువ జనాభాను ఉత్పాదక శక్తిగా మార్చవచ్చు. సాంకేతికతను ఉపయోగించి, గ్రామీణ -నగ ర అసమానతలను తగ్గించవచ్చు. సమర్థవంతమైన ప్రణాళికల ద్వారా, జనాభా సమస్య ల సవాళ్ల నుంచి సమృద్ధికి మార్గాలను వెతికితే.. కొన్ని దశాబ్దాల్లోనే ఇండియా నంబర్ వన్ ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశాలుఉన్నాయి.

 వ్యాసకర్త సెల్ 9640466464