03-05-2025 01:19:08 AM
జగిత్యాల అర్బన్, మే 2 (విజయక్రాంతి): జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజులు మే 1వ తేది నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు.
శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ సూచించారు. జిల్లా ప్రజలు పోలీసు వారికి ఈ విషయంలో సహకరించాలని శాంతి భద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.