22 June, 2026 | 7:46 PM

Breaking News

విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •  

పెంచిన బస్ చార్జీలను తగ్గించాలి

08-10-2025 01:25 AM

బీఆర్‌ఎస్ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు

ముషీరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో పెం చిన ఆర్టీసి బస్ టికెట్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్‌ఎస్ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు డిమాండ్ చేశా రు. ఈ మేరకు మంగళవారం భోలక్ పూర్ డివిజన్లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి స్టేజీకి 5 రూపాయలు పెంచడం దారుణం అన్నారు.

పేద, మధ్యతరగతి ప్రజలపై పెంచిన టికెట్ చార్జీల వల్ల అధిక భారం పడనున్నదని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ ఎస్ భోలక్ పూర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు ఉమాకాంత్, డివిజన్ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, ప్రవీణ్, సోషల్ మీడియా ఇన్చార్జి ప్రవీణ్ కుమార్, మగ్బూ ల్ తదితరులు పాల్గొన్నారు.