calender_icon.png 16 August, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్లు

16-08-2025 12:48:52 AM

సంక్షేమ పథకాల అమలులో టాప్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కరీంనగర్, ఆగస్ట్15(విజయక్రాంతి): ఇం దిరమ్మ ఇండ్లు :జిల్లాలో ఇంటి స్థలం ఉండి దరఖాస్తు చేసుకున్న 11 వేల 575 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని  ఇప్పటికే 5 వేల 672 ఇండ్ల ని ర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరు గుతున్నాయని.

గృహ నిర్మాణాన్ని బట్టి దశ ల వారీగా లబ్దిదారులకు 32 కోట్ల 30 లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింద ని రాష్ట్ర ఐ టి, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని  కరీంనగర్ పోలీస్ పరేడు మైదానంలో జా తీయ పతాకాన్ని అవిష్కరించారు.

ఈ సంద ర్బంగా కరీంనగర్ జిల్లాలోఅమలు చేస్తున్న  వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను  వివరించారు.  జిల్లాలో 5 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో “సెంటర్ ఆఫ్ ముర్రెల్ ఎక్సలెన్స్‌” స్థాపించేందుకు తొలి విడతగా కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది.