16-08-2025 12:41:01 AM
కోదాడ: పట్టణంలోని ఐవిఓ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ కో. ఆర్డినేటర్ అండ్ ఐవో నేషనల్ పిల్లర్ మెంబర్ డా.జి.మధుసూదన్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇంటిగ్రేటెడ్ వెటర్నర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ వెటరన్ డా చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.100 అడుగుల జాతీయ జెండాకు కృషి చేసిన పలువురికి సన్మానించి, ప్రశంసా పత్రాలు అందించారు.