17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు ?

15-10-2025 12:00 AM

-ప్రాక్టికల్ పరీక్షలు కూడా ముందుగానే..

-అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు

-జేఈఈ, నీట్‌కు విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకే షెడ్యూల్‌లో మార్పులు

-పరీక్ష ఫీజు పెంపు యోచనలో సర్కార్

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో  ప్రారంభించాలని బోర్డు భావవిస్తున్నట్లు తెలిసిం ది. ఈ మేరకు ప్రభుత్వానికి బోర్డు అధికారులు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది.  ఇంటర్ పరీక్షల తర్వాత జేఈఈ, నీట్ వంటి  పోటీ పరీక్షలకు విద్యార్థులకు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్‌ను మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గత విద్యాసంవత్సరం మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించారు.

ఏప్రిల్ 2వ తేదీ నుంచి జేఈఈ తుది విడత మొదలైంది. దీంతో విద్యార్థులకు సన్నద్ధమయ్యేందుకు పెద్దగా సమయం దొరకకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీన్ని అధిగమించేందుకు గానూ ఈసారి కాస్త ముందు గా నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మరీ ఇలా అయితే ప్రాక్టికల్ పరీక్షలను కూడా కాస్త ముందే జరపాల్సి ఉంటు ంది. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే పరీక్ష ఫీజు పెంపు యోచనలో కూడా బోర్డు ఉన్నట్లు తెలిసింది. ఈ విద్యాసంవత్సరం 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.