15 April, 2026 | 12:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

‘జైషే మహ్మద్’ చీఫ్ మసూద్‌కు కోలుకోలేని దెబ్బ

08-05-2025 01:23 AM
  1. ఉగ్రవాద సంస్థ స్థావరంపై భారత సైన్యం దాడి
  2. 10 మంది మసూద్ కుటుంబ సభ్యులు మృతి

న్యూఢిల్లీ, మే 7: భారత సైన్యం జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ మసూద్ అజార్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతర్జాతీ య సరిహద్దుకు 100 కి.మీ దూరంలోని బహవల్‌పూర్ మర్కాజ్ సుబాన్‌లోని ఆ ఉగ్రవాద స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందారు. వీరిలో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులే కావడం గమనార్హం.

మృతు ల్లో మసూద్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలితో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు తెలిసింది. పూల్వామా దాడికి కూడా మసూద్‌నే పథక రచన చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. వ్యూహరచనకు మసూద్ బహవల్‌పూర్ మార్కాజ్ సుబాన్‌లోని స్థావరాన్నే వినియోగిస్తాడని తెలిసింది. ప్రస్తుతం ఈ స్థావరంలో 600 మంది ఉగ్రవాదులు ఉంటున్నట్లు సమాచారం.