30 August, 2026 | 11:57 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

పాలు పడటం లేదా?

04-05-2025 12:00 AM

దాదాపు అంతా పాలు తాగుతుంటారు కానీ కొందరికివి పడకపోవచ్చు. పాలలో లాక్టోజ్ అనే చక్కెర ఉంటుంది. దీన్ని చిన్న పేగుల నుంచి పుట్టుకొచ్చే లాక్టేజ్ ఎంజైమ్ విచ్చిన్నం చేసి, పాలు జీర్ణమయ్యేలా చేస్తుంది. అయితే దీని ఉత్పత్తి ఐదేళ్ల తర్వాత సహజంగా తగ్గుతూ వస్తుంది. కొందరిలో జన్యుపరంగా లాక్టేజ్ మోతాదు గణనీయంగా పడిపోవచ్చు కూడా.

దీంతో కొద్దిగా పాలు తాగినా జీర్ణం కావు. దీన్నే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. సాధారణంగా లాక్టేజ్ ఎంజైమ్ పాలను గ్లూకోజు, గ్యాలక్టోజ్ అనే చక్కెరలుగా విడగొడుతుంది. ఇవి పేగుల గోడల ద్వారా రక్తంలో కలుస్తాయి. లాక్టేజ్ ఎంజైమ్ తగినంత ఉత్పత్తి కాకపోతే లాక్టోజ్ నేరుగా పెద్ద పేగులోకి వెళ్తుంది. ఇది అక్కడి బ్యాక్టీరియాతో చర్య జరుపుతుంది.

ఫలితంగా విరేచనాలు, వికారం, కొన్నిసార్లు వాంతులు, కడుపునొప్పి, కడుపుబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాలు తాగాక అరగంట నుంచి రెండు గంటల్లో ఇవి తలెత్తుతాయి. పాలు, పాలతో చేసే పదార్థాలు తినటం మానేస్తే ఇవీ తగ్గుతాయి. కావాలంటే పెరుగు తీసుకోవచ్చు. ఇది పాక్షికంగా జీర్ణమైన పాలతో తయారవుతుంది. కాబట్టి శరీరం బాగానే గ్రహిస్తుంది.