15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?

12-01-2026 01:34 AM

థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ సినిమా

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోందని ఆదివారం ఎక్స్ వేదికగా స్పం దించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుందని, మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి ఏమో నాకు తెలియదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నడుపుతున్నది సర్కా రా.. లేక సర్కస్ కంపెనీనా? టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసి నా.. ఈ ప్రభుత్వ తీరు మారడం లేదన్నారు. సీఎం అసెంబ్లీ వేదికగా టికెట్‌రేట్ల పెంపు ఉండదని చెప్పి రాత్రికి రాత్రే పెంపు జీవోలు ఎట్లా వచ్చాయన్నారు.