13 May, 2026 | 10:30 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు

23-07-2025 12:29 AM

24 గంటల్లో 63 మంది మృతి

గాజా సిటీ, జూలై 22: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తా జాగా జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 63 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గాజాలోని డేర్ ఎల్‌ఛీ ప్రాంతాల్లోకి  తొలిసారి ప్రవేశిం చాయి. మంగళవారం తెల్లవారుజామున గాజాపై  ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇప్పటివరకు యుద్ధంలో మృతి చెందిన వారి పాలస్తీనియుల సంఖ్య 59 వేలు దాటినట్టు తెలుస్తోంది.

దాదాపు 1.42 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. మరోవైపు గా జాలో ఎటువైపు చూసినా ఆకలి ఆర్తనాదాలే వినిపించాయి. అన్నం కోసం పడిగాపులు కాస్తున్న గాజా వాసులపై ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, తుపాకీ గుళ్లతో దాడికి పాల్పడుతోందని డబ్ల్యూఎఫ్‌ఓ పే ర్కొంది. గాజాలో ఆహారం నిండి ఉన్న వాహనాల కాన్వాయ్ వై పు దూసుకెళ్లిన పాలస్తీనా జన సమూహంపై ఆదివారం జరిపిన దాడిలో 80 మంది మృతి చెందడం గమనార్హం.