9 May, 2026 | 9:46 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

జడేజా అదుర్స్

24-01-2025 01:12 AM

ముంబై: రంజీ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున అదరగొట్టాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో బౌలింగ్‌లో మెరిసిన జడేజా ఐదు వికెట్లు పడగొట్టాడు.దీంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు కుప్పకూలింది. ప్రస్తుతం సౌరాష్ట్ర 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక భారత కెప్టెన్ రోహిత్ నిరాశపరిచాడు.

జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అతడితో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) కూడా విఫలమయ్యాడు. ఫలితంగా ముంబై 120 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ కశ్మీర్ 174 పరుగులకు ఆలౌటైంది.

శుబ్‌మన్ కజురియా (53) రాణించాడు. ప్రస్తుతం ముంబై 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగాల్‌తో మ్యాచ్‌లో హర్యానా 157 పరుగులకు ఆలౌట్ కాగా.. కేరళతో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 160 పరుగులకు ఆలౌటైంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి కేరళ వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది.