calender_icon.png 23 June, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల గుండెల్లో శ్రీపాదరావు

03-03-2025 12:32:08 AM

కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజల గుండెల్లో నిలిచిన మహానీయుడాయన

ఉమ్మడి జిల్లాలో ఘనంగా జయంతి వేడుకలు

మంచిర్యాల, మార్చి 2 (విజయక్రాంతి) : శాసన సభ్యుడిగా, ప్రజల ప్రతినిధిగా ప్రజా శ్రేయస్సు కోసం విశిష్ట సేవలు అందించిన దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేసి విశిష్ట సేవలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి శ్రీపాదరావు అని అన్నారు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించిన శ్రీపాదరావు మంథని నియోజకవర్గ శాసనసభ్యులుగా, శాసనసభ స్పీకర్ గా వివిధ పదవులలో పని చేశారని తెలిపారు. వినూ త్న సంస్కరణలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రభుత్వం శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి ఆధ్వర్యంలో శ్రీపాదరావు జయంతి

మందమర్రి, మార్చి 2 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దుల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు సింగరేణి యాజమాన్యం ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏరియా లోని కేకే ఓసీపిలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేకే ఓసిపి మేనేజర్ రామరాజు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు శ్రీపాదరావు అని, ఆయన ఉమ్మడి రాష్ర్ట శాసనసభ స్పీకర్‌గా సమర్థ వంతంగా విధులు నిర్వహించారన్నారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివై ఎస్‌ఎస్‌ఓ రవీందర్, యూనియన్ నాయకులు కేకే ఓసి సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్లో శ్రీపాదరావు జయంతి

నిర్మల్, మార్చి ౨ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు శివరాజ్ అధికారులు ఉన్నారు.

నిర్మల్ ఏఎస్‌పీ ఆఫీసులో..

నిర్మల్, మార్చి  2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏఎస్పీ కార్యాల యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.. ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి, పోలీసులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.