26-12-2025 05:23:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ వివిధ శాఖలో పనిచేస్తున్న కాంటాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని వేతనాలు పెంచుతామని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు