2 July, 2026 | 12:02 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

ఆత్మకూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి 36 మంది చేరిక

01-12-2025 07:06 PM

నాగిరెడ్డిపేట (విజయక్రాంతి): మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నుండి కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో 36 మంది చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరారని గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం బాల్‌రెడ్డి తెలిపారు. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గడ్డం బాల్‌రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారనన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.