14 July, 2026 | 3:27 PM

Breaking News

చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •  

కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివి

05-10-2025 06:27 PM

దళితరత్న తుంగపిండి రాజేష్ కుమార్..

మందమర్రి (విజయక్రాంతి): దివంగత కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాక) బడుగు బలహీన కార్మిక వర్గానికి చేసిన సేవలు మరువలేనివని దళిత రత్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ అన్నారు. కాక 96వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా  నిస్వార్ధ సేవలు అందించి నిరుపేద, అణగారిన వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. బొగ్గు గని కార్మికులకు పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చి గని కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని, సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి కార్మిక పక్షపాతిగా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు.