26 May, 2026 | 5:07 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివి

05-10-2025 06:27 PM

దళితరత్న తుంగపిండి రాజేష్ కుమార్..

మందమర్రి (విజయక్రాంతి): దివంగత కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాక) బడుగు బలహీన కార్మిక వర్గానికి చేసిన సేవలు మరువలేనివని దళిత రత్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ అన్నారు. కాక 96వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా  నిస్వార్ధ సేవలు అందించి నిరుపేద, అణగారిన వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. బొగ్గు గని కార్మికులకు పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చి గని కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని, సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి కార్మిక పక్షపాతిగా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు.