17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కామారెడ్డి పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఎన్నిక

03-01-2026 08:15 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ కార్యాలయంలో  శనివారం ఎన్నుకున్నారు. ఎన్నికల్లో భాగంగా అన్ని పదవులకు ఒకటి చొప్పున నామినేషన్ వచ్చినందున.. కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి టీఎన్జీవోస్ కామారెడ్డి అర్బన్ ఉపాధ్యక్షుడు భక్తవత్సలం ప్రకటించారు.

ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మహేష్ గౌడ్..

ఫోరం కార్యవర్గం నూతన జిల్లా అధ్యక్షుడిగా మహేష్ గౌడ్, సహాధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, జిల్లా కోశాధికారిగా అల్లాడి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పబ్లిసిటీ సెక్రెటరీ, ఆఫీస్ సెక్రెటరీ, జిల్లా ఈసీ మెంబర్ల కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు, జిల్లా సహాధ్యక్షుడు చక్రధర్, జిల్లా కోశాధికారి దేవరాజు, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ఈసీ మెంబర్ శివకుమార్, సంయుక్త కార్యదర్శి రమణ కుమార్, జిల్లా ఈసీ మెంబర్ దత్తాద్రి, అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సృజన్, జిల్లా పంచాయితీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.