11-07-2025 12:57:43 AM
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన హైదరాబాద్లోని నందినగర్లోని తన నివాసానికి వెళ్లా రు. ఈనెల 3న యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్కు వైద్యుల పరీక్షలు చేసి అడ్మిట్ కావాలని వైద్యులు చెప్పారు. వైద్య పరీక్షల అనం తరం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కేసీఆర్ ఈనెల 5న డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత మరోసారి రావాలని వైద్యులు చెప్పడంతో గురు వారం మరోసారి ఆసుపత్రికి వెళ్లారు.