calender_icon.png 6 August, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసమర్థను కప్పి పుచ్చుకునేందుకే కేసులు

05-12-2024 10:35:26 PM

భైంసా,(విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తమ ప్రభుత్వ వైఫల్యాలన్ని కప్పి పుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ  ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీఆర్‌ఎస్ ముథోల్ నాయకుడు కిరణ్ కొమ్రెవార్ ఓ ప్రకటనలో ఆరోపించారు.  మాజీ మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డిలపై ఫోన్‌ట్యాపింగ్ కేసులు పెట్టడం ప్రభుత్వం పిరికి చర్యలన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగు విధంగా జవాబు చెపుతారని తమ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.