calender_icon.png 13 January, 2026 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలిపటమా.. పద.. పదా!

13-01-2026 12:03:07 AM

గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. అక్కడి సబర్మతి రివర్‌ఫ్రంట్ వద్ద ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో కలిసి హనుమంతుని చిత్రంతో ఉన్న గాలిపటం ఎగురవేస్తూ సందడి చేశారు. ఫెస్టివల్‌లో వీరిద్దరి ఉత్సాహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు ఇద్దరు నేతలు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.