23-07-2025 07:13:09 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలో బుధవారం లయన్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనంగా లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా రెండవసారి కొప్పుల నర్సారెడ్డిని ఎన్నుకోన్నారు. సెక్రెటరీగా వి కమలాకర్ రావును, ట్రెజరీగా కోతి లింభారెడ్డిని ఎన్నుకోన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా డిస్టిక్ ఫస్ట్ వైస్ గవర్నర్ విజయలక్ష్మి, సెకండ్ వైస్ గవర్నర్ నరసింహరాజు, రీజనల్ చైర్పర్సన్ సి అనిత, డిస్టిక్ కో ఆర్డినేటర్ రాజన్న, డిస్టిక్ మెంబర్ నరసింహ, లయన్స్ క్లబ్ సభ్యులు గాదరి గంగారెడ్డి, లడ్డు శ్రీనివాస్ రెడ్డి, వడ్ల రాజేందర్, నల్ల మహిపాల్ రెడ్డి, రాములు, జనగామ గంగారెడ్డి, నల్ల బాయికాడ నారాయణరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.