calender_icon.png 19 July, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ గా డా. ఎం. ప్రసూన

18-07-2025 11:45:45 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ గా డా. ఎం. ప్రసూన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కె.వి.కె ప్రోగ్రాం కోఆర్డినేటర్ శివకృష్ణ పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ స్థానంలో పలు ప్రాంతాల్లో పనిచేసిన ప్రసూన బెల్లంపల్లి కేవీ కేకు వదిలయ్యారు. ఇంతకుముందు హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ పరిధిలోని కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, హైదరాబాద్ విస్తరణ విభాగపు ఆచార్యులుగా, కృషి విజ్ఞాన కేంద్రం, రస్థకుంటుబాయి, విజయనగరంలో శాస్త్రవేత్తగా, ఏరువాక కేంద్రం, రంగారెడ్డిలో, వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్  వ్యవసాయ సమాచార కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా ప్రజా సంబంధాల శాఖ అధికారిగా, వ్యవసాయ విద్యా సంస్థ (EEI) లో ఆచార్యులుగా ప్రసూన విధులు నిర్వర్తించారు.

ఈ సందర్భంగా డా. ప్రసూన  మాట్లాడుతూ, రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవలంభించాలని తెలిపారు. సమగ్ర పంటల యాజమాన్యం, సమగ్ర ఎరువుల యాజమాన్యం,సస్యరక్షణ, సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను పాటించడంతో పాటు గృహ విజ్ఞాన సంబంధిత సాంకేతికతను ముఖ్యంగా మహిళా రైతులకు మరింత చేరువ చేసేలా ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపారు. ఎప్పుడైనా తమ సలహాల కోసం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో ఉండే వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించాలని రైతులకు ఆమె సూచించారు.