15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గం

29-01-2026 03:32 PM

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కి సిట్ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ద్వజమెత్తారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపులకు నిదర్శమని తెలిపారు. పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లు ఆరోపించారు. ఇది విచారణ కాదు.. ప్రతీకారం, ఇది న్యాయం కాదు.. రాజకీయ దురుద్దేశం అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సూచించారు. ప్రజల గొంతుకగా అన్యాయపు పాలనపై పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ వెల్లడించారు. హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.