24-01-2025 02:10:46 PM
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) చందుర్తి మండలం తిమ్మాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి(Leopard Movement) సంచారం ఉన్న నేపథ్యంలో అటవీశాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం సూచించారు. రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండాపూర్ శివారులోని సీసీటీవీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు రికార్డయ్యాయి. తిమ్మాపూర్ కొండాపూర్తో సరిహద్దును పంచుకోవడంతో అటవీ అధికారులు(Forest officials) స్థానికులను, ముఖ్యంగా రైతులను అప్రమత్తం చేశారు.