14 April, 2026 | 1:20 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం

26-11-2025 08:00 PM

సబ్ జడ్జి పి.బి కిరణ్ కుమార్

హుజురాబాద్ (విజయక్రాంతి): రాజ్యాంగ విలువల్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని హుజురాబాద్ సబ్ జడ్జ్ పి బి కిరణ్ కుమార్ సూచించారు. న్యాయ దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కోర్టు నుండి బుధవారం అంబేద్కర్ కూడలి వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సబ్ జడ్జ్ పిబి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమలు అయ్యేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత పాటు పౌరులందరూ బాధ్యతలను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయి శ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, ఏజిపి గుర్రం శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు ముక్కెర  రాజు, భూమ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాను కిరణ్, రవీందర్,రమేష్ తిరుపతి,శివరామకృష్ణ, శిరీష తోపాటు తదితరులు పాల్గొన్నారు.