15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కలిసి వచ్చిన రిజర్వేషన్..

26-11-2025 07:25 PM

ఆ గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే..

తాండూరు (విజయక్రాంతి): అదృష్టం అంటే ఆ కుటుంబానిదే... ఆ కుటుంబానికి గ్రామపంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ కలిసొచ్చింది.. అంతేకాదు రెండు వార్డు సభ్యులు సైతం ఆ కుటుంబానికి వరించింది.. పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామానికి సర్పంచ్ ఎన్నికలకు గాను అధికారులు షెడ్యూల్ ట్రైబల్ వర్గానికి రిజర్వ్ చేశారు. అయితే ఆ గ్రామంలో 8 వార్డులకు గాను 494 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకలి భీమప్ప కుటుంబం ఒకటే ఉంది. రిజర్వేషన్ పుణ్యమా అని ఈ కుటుంబం నుండే ఎవరికో ఒకరికి సర్పంచ్ పదవి దాదాపు ఖరారు కానుంది. అంతేకాదు రెండు వార్డులు ఎస్టీ జనరల్, ఎస్టి ఉమెన్ రిజర్వ్ కావడంతో ఆ కుటుంబం నుండి మరో ఇద్దరు వార్డు సభ్యులు కూడా కానున్నారు. ఇక కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు తమ పార్టీ తరఫునుండి నామినేషన్ వేయాలంటూ ఆ ఇంటికి క్యూ కట్టారు. ఏది ఏమైనా రిజర్వేషన్ ఆ కుటుంబ అదృష్ట తలుపు తట్టిందని చెప్పవచ్చు.