14-06-2025 12:00:00 AM
కార్వాన్, జూన్ 13: బోనాలను పండుగను ఘనంగా నిర్వహించుకుందామని పలు వురు ప్రముఖులు పిలుపునిచ్చారు. జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోల్కొండ బోనాలను పురస్కరించుకొని శుక్రవారం గోల్కొండ కోటలో ట్రస్ట్ కమిటీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో సమావేశమయ్యా రు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోల్కొం డ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్ సైదు లు, సలహాదారు రాజు తదితరులు హాజరయ్యారు.
గోల్కొండ బోనాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. గతంలో కంటే ఈసారి అత్యంత వైభవంగా అమ్మవార్ల బోనాలను నిర్వహిద్దామని తెలియజేశారు. నాయకులు అధికారులు, అందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్ అడ్వైజర్ సాయిబాబా చారి, మహంకాళి అమ్మవారి పూజారి శివచారి, సురేష్ చారి, వర్కర్స్ ప్రెసిడెంట్ శివకుమార్, వైస్ ప్రెసిడెంట్ బొమ్మల శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.