23-01-2026 11:42:21 PM
అచ్చంపేట జనవరి 23: వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేసిన చిన్నారులు త్వరగా చదువు నేర్చుకోవడానికి అవ కాశం ఉంటుందని అర్చకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం అచ్చంపేటలోని సీతరాళ్ల గుట్ట సరస్వతిదేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా పద్మశాలి మహిళ సం ఘం అధ్యక్షురాలు దాసపత్రి శకుంతల ఆధ్వర్యంలో సరస్వతి మాతకు అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 25 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు.
ఆలయ అర్చకులు చిదంబర శాస్త్రి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు కోట కిషోర్ పూజలో పా ల్గొన్న వారికి పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో గుర్రం హైమావతి, గంజి నిర్మల, కోట ప్రశాంతి, ఇమ్మడి రాజేశ్వరి, దాసు జం గమ్మ, బాలకిష్టమ్మ, నారాయణమ్మ, పద్మ, శ్రీదేవి, బాలమణి, మానస, సావిత్రి, దాసు శ్రీనివాసులు, వనం వేణు, రంగ రాజు, మా కం శేఖర్ లు పాల్గొన్నారు.